అలా చేస్తే బస్ పాస్ ఛార్జీలు తగ్గిస్తాం: పొన్నం ప్రకటన

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త అందజేశారు మంత్రి పోన్నం ప్రభాకర్. నిన్న పెంచిన బస్ చార్జీలపై కీలక వాక్యాలు చేశారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కొన్ని సంవత్సరాల నుంచి బస్ పాస్ చార్జీల పెంపు లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదని అన్నారు. కేంద్రం ఆర్టీసీకి టోల్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చినట్లయితే పెరిగిన బస్ పాస్ చార్జీలు తగ్గిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

RTC union leaders hold talks with Minister Ponnam Prabhakar
RTC union leaders hold talks with Minister Ponnam Prabhakar

మహిళలకు ఉచిత బస్సు కల్పించిన అనంతరం రూ. 6వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా…. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతున్నాయి. జూన్ 26 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈరోజు ఆషాడ బోనాల రివ్యూ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కొండా సురేఖ, పోన్నం ప్రభాకర్ తో సహా మరి కొంత మంది మంత్రులు హాజరయ్యారు. ఈ సంవత్సరం బోనాలు గ్రాండ్ గా జరిపిస్తామని కొండా సురేఖ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news