పెద్దల సమక్షంలో వింత పెళ్లి.. వరుడు ఒక్కడు.. వధువులిద్దరు!?

-

అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఓ వరుడు ఇద్దరి వధువులకు తాళి కట్టి తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బేతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంకు చెందిన సందీప్‌ ఉకే అనే యువకుడు తను చదువుతున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

man married two womens at a time
man married two womens at a time

అయితే ఈ విషయం తెలియని తల్లితండ్రులు అతనికి మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు తన ప్రేమ వ్యవహారం తల్లితండ్రులకు చెప్పడంతో ఏం చెయ్యాలో తోచక గ్రామా పెద్దల వద్దకు విషయాన్నీ తీసుకెళ్లారు. గ్రామా పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడగా ఇద్దరు యువతులు అతనినే పెళ్లి చేసుకుంటాం అని చెప్పారు.

దీనికి సందీప్ కూడా అంగీకారం తెలపడంతో.. మూడు కుటుంబాల సమక్షంలో ఈ నెల 8వ తేదీన ఘనంగా పెళ్లి జరిగింది. ఇంకా ఈ పెళ్లికి ప్రధాన సాక్షిగా గ్రామ పెద్ద మిశ్రాలాల్‌ వ్యవహరించారు. అమ్మాయిలకు వారి కుటుంబసభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు అయన వెల్లడించారు. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news