దూబే ఎన్‌కౌంటర్‌.. ఆయన భార్య ఏమన్నారంటే..?

-

మధ్య ప్రదేశ్‌ లోని ఉజ్జయినీలో నిన్న పట్టుబడ్డ కాన్పూర్ గ్యాంగ్‌ స్టర్ వికాస్ దూబేను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు  ఉత్తర ప్రదేశ్‌ కు తరలిస్తుండగా కాన్వాయ్‌ లోని ఓ కారు బారా వద్ద ఉదయం 7.00 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. దీన్ని అవకాశం తీసుకుని తప్పించుకోవడానికి దూబే ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు.  దీంతో దూబే మరణించాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. దీనిపై ఆయన భార్య స్పందిస్తూ, ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు.

చేసిన పాపానికి దూబే బలైపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. కాన్పూర్‌ లోని భైరవ్ ఘాట్‌లో నిర్వహించిన దుబే అంత్యక్రియలకు ఆమె సోదరుడు, కుమారుడు తప్ప ఇతర బంధువులెవరూ హాజరుకాలేదు. దూబే తల్లే  కుమారుడి ముఖాన్ని చూసేందుకు సుముఖం వ్యక్తం చేయలేదు. తమ మాట ఏనాడూ వినలేదని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంత్యక్రియలకు తాను హాజరు కాబోనని ముందే చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news