వధువు తల్లితో పారిపోయిన వరుడి తండ్రి.. ఆ త‌ర్వాత‌..

-

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాత్కాలిక సూఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు తల్లిదండ్రుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు తల్లి లేచిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన 48 సంవత్సరాల వ్యక్తి కొడుకుతో… అదే నగరానికి చెందిన 46 సంవత్సరాల మహిళ కూతురికి పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి రెండో వారంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించారు.

అయితే, గత పది రోజుల నుంచి వారిద్దరూ కనిపించడం లేదు. రెండు ఇళ్లలోనూ ఇద్దరూ ఒకేసారి ఇలా ‘కనిపించకుండా’ పోవడంతో అందరికీ అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి జరిగితే వరుసకు వరుడి తండ్రి, వధువు తల్లి అన్నాచెల్లెళ్లు అవుతారు. దీంతో వారు కనిపించకుండా పోయారు. అయితే వారిద్దరి నడుమ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉండడంతో పెళ్లి జరిగితే అన్నాచెలెళ్లు అవ్వాల్సి వస్తుందని దీంతో ఇద్దరు కలిసి చెప్పపెట్టకుండా పారిపోయార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news