మేము పెళ్లి చేసుకోవాలి… పాస్పోర్ట్ ఇవ్వండంటున్న అమ్మాయిలు…!

-

లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి కుదిరినా సరే చేసుకునే పరిస్థితి దాదాపుగా లేదు. దీనితో చాలా మంది నడిచి వెళ్లి కూడా వివాహాలు చేసుకునే పరిస్థితి దేశంలో ఉంది. ఇక తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. మేము పెళ్లి చేసుకోవాలి పాస్పోర్ట్ ఇవ్వండి అంటూ అమ్మాయిలు క్యూ కడుతున్నారట. మంగళవారం నుంచి పాస్పోర్ట్ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి.

వందల మంది పాస్పోర్ట్ కోసం క్యూ కట్టారు. వారిలో ఎక్కువగా పెళ్లి కూతుళ్ళు ఉన్నారట. పంజాబ్ లోని జలంధర్ లో ఒక పాస్పోర్ట్ కేంద్రంలో 241 మంది పాస్‌పోర్ట్ కోసం వచ్చారు. వీరిలో కొత్త పెళ్లి కూతుళ్ళు ఉన్నారు. ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడాలి అని కొరిక ఉన్న వారు అని అందుకే వాళ్ళు వచ్చారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారు అందరూ వచ్చారని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఎక్కువగా కెనడా మెక్సికో వెళ్ళే వారు ఉన్నారని… తన పెళ్లి వచ్చే నెల ఉందని తాను విదేశాలకు వెళ్ళాలి అని కాబట్టి తనకు పాస్పోర్ట్ కోసం వచ్చా అని ఒక అమ్మాయి చెప్పింది. మరి కొందరు అయితే పెళ్లి అయిపోయింది తాము విదేశాలకు వెళ్ళాలి అని తమ భర్తలు విదేశాల్లో ఉన్నారని అందుకే వచ్చామని చెప్పారు. అయితే పాస్పోర్ట్ కేంద్రాలు అన్నీ కూడా సగం సిబ్బందితోనే ఉన్నాయి. 50 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news