ధోనీకి జొమాటో ట్రిబ్యూట్ : వారికి బంపర్ ఆఫర్ !

-

టీమిండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన ఫ్యాన్స్ కి అలానే క్రికెట్ లవర్స్ కి షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే 2019 వన్డే ప్రపంచకప్‌ లో చివరి సారిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ ని కూడా చేజార్చుకుని ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.

మొన్ననే రాంచీ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో అక్కడికి వెళ్లిన ధోనీ నిన్న చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆయన రిటైర్మెంట్ గురించి అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జోమాటో అయితే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే 183 రూపాయల విలువగల ఆర్డర్స్ మీద 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అది కూడా ఈరోజు రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల దాకానే. అందుకోసం MAHI అనే కూపన్ కోడ్ వాడాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ధోనీ సొంత ఊరు అయిన రాంచీ వారికే. ఇది ధోనీకి జోమాటో ట్రిబ్యూట్ అని సంస్థ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news