అంత ఖర్మనాకు పట్టలేదు… నాయిని నర్సింహారెడ్డి

-

కాంగ్రెస్ లో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. పొరపాటున 10 లక్షలు అనబోయి 10 కోట్లు అన్నానని… ఆ మాటలు పట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్‌ స్థానం నుంచి తన అల్లుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలను శిరసావహిస్తా అన్నారు.  రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓటమి భయం పట్టుకోవడంతో  కేసీఆర్‌ను తిడుతూ నాయకుడిగా ఎదగాలనే చాల్లర ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version