తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

-

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని ఆదివారాలు సెలవు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తితిదే ఆలయ అధికారు సమాచారం మేరకు.. 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు కనీసం ఐదు గంటల సమయం పడుతోంది.

యాదాద్రి (యాదగిరి గుట్ట) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతంలో ఉండటం వల్ల జంట నగరాలు, ఇతర జిల్లాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

Read more RELATED
Recommended to you

Latest news