తెలంగాణలో తెదేపాకు ఓటు బ్యాంక్ లేదు

-

త్వరలో రాహుల్ గాంధీకి వివరిస్తా..

తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో కాంగ్రెస్ పోత్తు వ్యవహరం మరో సారి పునరాలోచించాలి అని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ పెద్దలకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగు దేశానికి ఓటు బ్యాంక్ లేదని.. తెదేపా తో పొత్తు వల్ల మేం గెలిచే స్థానాలను సైతం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విషయమై త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానన్నారు.  మహా కూటమిలోని ఇతర పార్టీలకు పది సీట్లకంటే ఎక్కువ ఇవ్వడం మంచిది కాదన్నారు. తెరాస ప్రభుత్వం పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ఇంత వరకు తెరాస అధినేత కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళుతున్నారో అనే విషయాన్ని ప్రజలకు వివరించలేదన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తెరాస కు ఒక్క సీటు రాదని ఆయన జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version