విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు ఎనిమిదో రోజున దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు. వినాయక ఆలయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో తరలివస్తున్నారు. దీక్ష విరమణ చేయటానికి భవానీలు సైతం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దుర్గాదేవి రూపానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది.
దుర్గా దేవి అవతారంలో అమ్మవారు..
-
Previous article
Next article