నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’…

-

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో రాజకీయ వాతావారణం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నెల 9తో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగియనున్న నేపథ్యంలో నేటి నుంచి మరో వినూత్న కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ….‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.  ఇందులో భాగంగా రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు వైఖరిని ఎండగట్టనున్నారు.

అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్ రూపంలో పూర్తి చేస్తూ.. పోలవరంలో ఏమీ జరగకపోయిన జరుగుతున్నట్లు ప్రజలను, రైతులను నమ్మించే చంద్రబాబు మోసపూరిత వ్యవహారాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక నేటి నుంచి తెదేపా – వైసీపీ మధ్య ఎలాంటి వార్ జరగబోతుందో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news