రాజకీయ కక్షలో భాగంగానే ఐటీ దాడులు

-

కేంద్ర ప్రభుత్వం తెదేపా నేతలపై కక్షపూరితంగా వ్యవరిస్తుందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఐటీ దాడుల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ… నాకుంటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై  ఐటీ దాడులు చేసిన విధానాన్ని తప్పుపట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భాజపా తో కుమ్మకై..తన సొంత పత్రిక, టీవీ ఛానల్లలో తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఐటీ దాడుల్లో మూడు లక్షల రూపాయలు సొమ్ముమాత్రమే దొరికిందన్నారు. అవి కూడా దేవుడి మొక్కులు తీర్చేందుకు దాచి నట్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన కేంద్రానికి లొంగేదిలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news