వై.ఎస్. వివేకా హత్య గురించి సునిత సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి, తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వివేకాను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని ఆమె అన్నారు. రాజకీయాల నుండి వివేకాను కొందరు పక్కకు పెట్టాలని చూశారు.. అయినప్పటికీ ఆయన ప్రజా సేవలోనే ఉన్నారని గుర్తు చేశారు. దీంతో పక్కా స్కెచ్ వేసి తన తండ్రి వివేకాను హత్య చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను కొందరు పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన తండ్రి హత్యపై వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ మాటలనే సజ్జలు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. వైఎస్ వివేకా హత్యపై ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడటం తన తండ్రి కోరిక అని తెలిపారు. తన తండ్రి కోసం ఎన్నికల్లో షర్మిలకు మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news