సీబీఐ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఈడీ దాడులు…!

-

 

సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడు శ్రీనివాస్ ఇంటిపై  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులలోని ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. కర్ణాటకకు చెందిన ఓ బ్యాంకు నుంచి ఆయన రూ.315 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదని సమాచారం. దీంతో ఆ  బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈడి దాడులు చేసినట్లు తెలుస్తోంది. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు  తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేపట్టారు.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన సందర్భంగా తెరాసలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version