అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా..! పవన్‌ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్‌…

-

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పేర్ని నాని.ఇవాళ ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమై అనూహ్యంగా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై పేర్ని నాని స్పందిస్తూ… చంద్రబాబు ,పవన్ కళ్యాణ్  డ్రామాలతో  విసిగిపోయిన జనానికి, మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకు వచ్చారని మండి పడ్డారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ….పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ,చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేష్‌ ప్రకటించినా తాము మౌనంగా ఉన్నామని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని ఆయన అన్నారు.గడచిన నాలుగున్నరేళ్లుగా పవన్ ప్రకటించిన నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీకి ఇంఛార్జిలే లేరని.. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని అన్నారు. తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే తనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్‌ ఈ రోజు ప్రకటించాడు అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్‌కు అంత పౌరుషం ఉంటే కాకినాడ, తిరుపతి,వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాగా ఎమ్మెల్యే పేర్ని నాని అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news