అన్నకు రాఖీ కట్టి హెల్మెట్ బహుమతి ఇచ్చిన ఎంపీ

-

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు రాఖీ వేడుకను ఆనందంగా జరుపుకుంటున్నారు. అన్నకు రాఖీ కట్టి గతేడాది ఇచ్చినట్లుగానే హెల్మెట్ బహుమతిగా ఇచ్చారు ఎంపీ కవిత..

ఆదివారం రాఖీపండుగను పురష్కరించుకుని ఎంపీ కవిత తన అన్న కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. కాళ్లకు నమస్కరించి అన్న నుంచి దీవెనలు అందుకున్నారు. దీంతో కిందటేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నయ్యకు కవిత హెల్మెట్ ను బహుమతిగా ఇచ్చారు. కేటీఆర్ చేనేత చీరను బహుమతిగా కవితకు ఇచ్చారు. రాఖీ వేడుకకు సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు ఎంపీ.

 

అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజు ప్రతీ సోదరి అన్న, తమ్ముళ్లకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని గతేడాది ట్విటర్ వేదికగా ఎంపీ కవిత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news