టీజేఎస్ లోకి మర్రి ఆదిత్యరెడ్డి

-

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ జన సమితి (టీజేఎస్)  పార్టీలో అధినేత కోదండరాం సమక్షంలో పార్టీలో చేరారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆదిత్య రెడ్డితో పాటు, పారిశ్రామిక వేత్త బాల లింగంలను కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెరాస పై ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికి న్యాయం జరగాలి అన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. వచ్చే నెల 2న తెరాస నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు నియమ, నిబంధనల ప్రకారమే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మార్పుఅవసరం అందుకే ప్రస్తుతం యువ నాయకులు అవసరం ఎంతైనా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news