అయ్యప్ప సన్నిధానంలోకి చేరుకోనున్న మహిళలు!

-

శబరిమల అయ్యప్ప దర్శనం కోసం యత్నించిన మహిళలను గత రెండు రోజులుగా భక్తులు అడ్డుకుంటూ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో… బుధవారం ఆలయాన్ని తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఒక్క మహిళ కూడా అయ్యప్పను దర్శించుకోలేదు. కానీ హైదరాబాద్‌కు చెందిన కవిత అనే జర్నలిస్ట్‌తోపాటు మరో మహిళ అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు.  100 మంది పోలీసుల భద్రత మధ్య వీరు వేర్వేరుగా కొండపైకి చేరుకుంటున్నారు. కవిత హెల్మెట్ ధరించగా.. కేరళ పోలీసులు రింగ్ ఫెన్స్ ద్వారా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మరో మహిళ నల్లటి వస్త్రాలతో ఇరుముడిని అయ్యప్ప స్వామికి సమర్పించడానికి వెళ్తున్నారు. అయ్యప్ప ఆలయానికి అతి చేరువలోకి ఆ ఇద్దరు మహిళలు చేరుకున్నారు… దీంతో మరికొద్ది క్షణాల్లో పదునెట్టాంబడి అని పిలిచే 18 మెట్లను ఎక్కనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version