ఎమ్మెల్యే రాపాక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప రైతుల కష్టాలు తీర్చలేదు : జనసేనాని

-

ఇక్కడ ఎమ్మెల్యే రాపాక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప రైతుల కష్టాలు తీర్చలేకపోయాడు అని జనసేనాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.రాజోలు వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే కో ఆపరేటివ్ సంస్థలను నిర్వీర్యం చేశారు అని అన్నారు.

రైతాంగానికి సంబంధం లేని ఎమ్మెల్సీ అనంత బాబును చైర్మన్ గా చేసారు, అతను దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు అని ప్రశ్నించారు.వైసీపీ ప్రజల మధ్య గొడవలు పెట్టడం కోసమే అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో అవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టింది వైసిపి ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ గొడవల్లో కీలక వ్యక్తి ఇప్పుడు మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నాడు.అంతర్వేది లో రథాన్ని తగలబెడితే తేనెటీగల పేరు చెప్పాడు ముఖ్యమంత్రి జగన్, చిన్న గులకరాయి వేస్తే నిందితుడిని 2 రోజుల్లో పట్టుకున్నారు కాని అంతర్వేది రథం విషయంలో ఈరోజుకు నిందితులను పట్టుకోలేదు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news