ఆరు నెలలకే అన్ని చేయలేదని అనడం సరికాదు.. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే కూనంనేని ఫైర్

-

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయినా సమయం ఇవ్వాలని.. అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వైఖరి ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.శనివారం అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని.. ఆరు నెలలకే అన్నీ చేయలేదు అనడం సరికాదని బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా జాగ్రత్త పడాలని, అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు.

తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం భావిస్తుందని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని..ఇదే సమయంలో అప్పులు ఉన్నాయి కాబట్టి హామీలు నెరవేర్చలేం అనడం కూడా సరికాదని ప్రభుత్వ పెద్దలకు ఆయన హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version