ఈ నెల 11న తెలంగాణకు ఎలక్షన్ కమిషన్ సభ్యులు

-

రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరాలపై కేంద్ర స్పందించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 9 నుంచి వారం లో పు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ లు రాష్ట్రానికి చేరుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఈసీఐఎల్ లో తయారవుతున్న యంత్రాలు, బెంగళూరులో తయారవుతున్న యంత్రాలు  తెలంగాణకు సరఫరా చేయాలని ఈసీ ఆదేశించింది. వీటితో పాటు ఈ నెల 11న కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటింస్తుందని, రాజకీయ పార్టీలతో సమావేశమవుతారని రజత్ కుమార్ తెలిపారు. ఈసీ బృందం అందించే నివేదిక ఆదారంగా ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version