ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

-

తెలంగాణలో నిర్వహించిన ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1,10,635 మంది ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులై తదుపరి దశకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులే ఉండటం విశేషం. పరీక్షకోసం మొత్తం 1,88,715 మంది దరఖాస్తు చేసుకోగా..1,88,482 మంది ఆగస్టు 26న నిర్వహించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కు హాజరయ్యారు.

మొత్తం మూడు దశల్లో నియామక ప్రక్రియను నిర్వహిస్తారు అందులో భాగంగా ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి రెండో దశలో ఈవెంట్స్ ఉంటాయి.. అక్కడ అర్హత సాధిస్తే తుది దశలో మెయిన్స్ రాత పరీక్షను నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి :

Read more RELATED
Recommended to you

Latest news