‘కామాక్షి మూవీస్’ అధినేత శివ ప్రసాద్ రెడ్డి కన్నుమూత

-

] ప్ర‌ముఖ నిర్మాత‌ కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి ఆయన  ‘కార్తీక పౌర్ణ‌మి’, ‘విక్కీ దాదా’, ‘శ్రావ‌ణ సంధ్య’‌,  ‘ముఠా మేస్త్రి’, ‘ఆటోడ్రైవ‌ర్’‌, ‘సీతారామ‌రాజు’, ‘అల్ల‌రి అల్లుడు’,  ‘నేనున్నాను’, ‘బాస్‌’, ‘ఎదురులేని మ‌నిషి’,  ‘కింగ్’, ‘కేడీ’, ‘ద‌డ‌’, ‘ర‌గ‌డ‌’,  ‘గ్రీకువీరుడు’ తదితర సినిమాల‌ను నిర్మించారు. ఈయ‌న మృతి ప‌ట్ల తెలుగు సినీ పరిశ్ర‌మ తీవ్ర  సంతాపం వ్య‌క్తం చేసింది.  ఇటీవలే ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news