కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి : దగ్గుపాటి పురందేశ్వరి

-

గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ….కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందట్లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని దుయ్యబట్టారు. అవసరమైనప్పుడే నేతలకు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందన్నారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవని పేర్కొన్నారు.

రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే జగన్ ప్రభుత్వం మూడుముక్కల ఆట ఆడుతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది బీజేపీ అని అన్నారు. అమరావతి రాజధాని అన్న విషయానికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.2014 తర్వాత అప్పుడే పుట్టిన ఆంధ్ర ప్రదేశ్ అనే పసిగుడ్డును సంరక్షించే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ తీసుకుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news