ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్

-

పూరి జగన్నాథ్. దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ “కెమెరామెన్ గంగతో రాంబాబు”. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానులను మరోసారి అలరించనుంది.త్వరలో తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ 2012వ సంవత్సరం అక్టోబర్ లో విడుదల అయింది.

ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ మూవీని ఫిబ్రవరిలో అనుకూలమైన మంచి డేట్ ను చూసుకుని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ వెల్లడించారు. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా నటించారు. సొసైటీలో జరిగే అరాచకాలను రాంబాబు, కెమెరామెన్ అయిన గంగ ఇలా ఎదుర్కొన్నారు అనే కథ అంశంతో రూపొందింది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించాడు. శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news