కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం ఆదాయం ఎంతంటే….. ?

-

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. గత వారమే మొదలైన ఈ జాతరకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ వెల్లడించారు.. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఆర్జీత సేవలు, దర్శనాలు,గదులు,ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.11,84,726, ఆదివారం రూ.47,82,420, సోమవారం రూ.10,55,161 ఆదాయం వచ్చిందనీ తెలిపారు.

గత ఏడాది పట్నం వారానికి రూ. 49,83,819 ఆదాయం మల్లికార్జున స్వామి వారి ఖజానాకు వచ్చిందన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి రూ.20,38,488 అదనంగా ఆదాయం సమ కూరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news