ఏపీలో గ్రూపు 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు

-

ఏపీపీఎస్సీ గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులు ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గత నెలలో 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూపు 1 పోస్టులకు జనవరి 01 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును జనవరి 28వ తేదీ వరకు పొడిగించింది ఏపీపీఎస్సీ. మార్చి 17న గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. 

ఆఫ్ లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరోవైపు గ్రూపు 2 నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 897 పోస్టులకు గ్రూపు2లో ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news