గుంటూరులో రోడ్డుపైకి మొస‌లి..లారీ డ్రైవ‌ర్ షాక్..!

-

గుంటూరు జిల్లాలో రోడ్డుపైకి మొస‌లి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాజుపాలెం మండలం అనుపాలెం చెప్టా వద్ద మొసలి లారీ కింద పడి చనిపోయింది. మొసలి వాగు నుండి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండ‌గా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ చూసుకోకుండా ముసలిని ఎక్కించగా అది చనిపోయిన తర్వాత దిగి చూసేస‌రికి మొస‌లి క‌నిపించ‌డంతో షాక్ అయ్యాడు. ఇక స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. స్థానికులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారు. మొస‌ళ్లు భ‌య‌ట‌కు రావ‌డంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని మోసాలు కూడా బయటకు వచ్చాయి అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొస‌లి బయటకు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news