చింతమనేనికి అవమానం..

-


ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే ఏపీ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఆయన పట్ల గుంటూరు జిల్లాలోని కాజా టోల్‌గేట్ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. తాను నూతనంగా కొనుగోలు చేసిన టొయోటా ఇన్నోవా క్రిస్టా కారు టోల్‌గేట్‌ వద్దకు వచ్చిన చింతమనేని కారును టోల్ సిబ్బంది నిలిపివేశారు. దీంతో తాను ఎమ్మెల్యేనని వారికి చింతమనేని వివరించారు… అయినప్పటికీ టోల్‌గేట్ సిబ్బంది కారును విడిచిపెట్టలేదు. సిబ్బంది తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని కారును టోల్‌గేట్ వద్దే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.

ఈ విషయమై టోల్ సిబ్బందిని వివరణ అడగ్గా…ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి చింతమనేని అంటే ఎవరో తెలియదన్నారు. విధుల్లో ఉన్న వ్యక్తి కాస్త ఆలోచించి ఉంటే బాగుండేదని అక్కడున్న వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పుడు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించే చింతమనేని ఈ సారి తానే అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news