చిరంజీవికి పద్మవిభూషణ్ …. సెలబ్రెటీలు ఎవరెవరు విషెష్ చెప్పారంటే…

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నాడు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభీషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు చెప్తున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ డైరెక్టుగా చిరంజీవి నివాసానికి వెళ్లి విషెస్ తెలుపుతుండగా మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వెంకటేష్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి,ప్రశాంత్ వర్మ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాజమౌళి,రామ్ చరణ్,రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, డైరెక్టర్ మారుతి,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నారా రోహిత్, రాధికా, డైరెక్టర్ వశిష్ఠ,.. ఇలా అనేక రంగాల ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news