B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్: వైఎస్ షర్మిల

-

ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీ అధినేతల పైన వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కీలక పార్టీలైన వైఎస్ఆర్సిపి ,జనసేన ,తెలుగుదేశం పార్టీలు బిజెపికి బానిసలుగా మారాయని వైయస్ షర్మిల ఆరోపించారు.శుక్రవారం నాడు షర్మిల గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్. రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం YSR పాలన కాదు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు. గుంటలూరు మళ్లీ గుంటూరు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది’ అని షర్మిల హామీ ఇచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి గడప తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలదని అన్నారు. ఏపీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news