తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

-

తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూలై 16 నుంచి ఈనెల 20 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ మేరకు అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వాలకు, ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది. వర్షాలకు కురిసే రాష్ట్రాల జాబితాను ఐఎండీ జాబితా విడుదల చేసింది.జూలై 16-20 మధ్య మహారాష్ట్ర,గోవా, గుజరాత్,కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే తెలంగాణ,రాజస్థాన్, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే హర్యానా,పంజాబ్, ఢిల్లీలో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news