తన భర్తను దారణంగా హత్య చేయించిన తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ లకు కఠిన శిక్ష పడాల్సిందే అంటూ పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి పేర్కొంది. ఆదివారం ఉదయం మిర్యాలగూడలోని ప్రణయ్ మృత దేహాన్ని చూసి బోరున విలపించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… తన భర్త హత్యే ఆఖరి పరువు హత్య కావాలి… ఇకపై ఇటువంటి కుల దురహంకార హత్యలు జరగకుండా ఉద్యమిస్తా… తన భర్త మరణిస్తే తన కుటుంబం వద్దకు వెళ్తానని తల్లీదండ్రులు అనుకున్నారేమో కానీ అది జరగదు అంటూ తన తండ్రిపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించి కులపిచ్చి ఉన్న పెద్దలకు నిత్యం ఈ సంఘటన గుర్తొచ్చేలా చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది.
పరువు హత్యలపై ఉద్యమిస్తా.. అమృత వర్షిణి
-
Previous article
Next article