ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని, ఆ మాజీ లవర్ ఏమిచేశాడంటే

-

ఈ రోజుల్లో ప్రేమలు, పెళ్లిళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రేమించుకున్న వారు పెళ్ళిపీటల వరకు వెళతారా,పెళ్లి మండపంలో తాళి కట్టినవారు కడవరకు తోడు ఉంటారా అన్న దానిపై అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ రోజుల్లో ఏర్పడుతున్న ప్రేమల్లో ప్రతీకారం,మూర్ఖత్వం అనేది మెండుగా కనిపిస్తుంది. ప్రేమించని వారు దక్కకపోయినా వారు సంతోషంగా ఉంటె చాలు అనుకొనే యువత నుంచి నన్ను కాదనుకున్న వ్యక్తి అసలు భూమి మీదే ఉండకూడదు అన్న కక్షల వరకు యువత అభివృద్ధి చెందుతుంది అని చెప్పాలి. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ప్రేమించిన యువకుడు చేసిన పనికి తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే…. యూపీ లోని సలోన్ గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే కొద్దీ రోజులు బాగానే ఉన్న వీరి ప్రేమ నిదానంగా వారి మధ్య మనస్పర్థలకు దారి తీసింది. దీనితో వారిద్దరూ కూడా విడిపోయి ఎవరికీ వారు సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనీ నిశ్చయించుకొని ఒక లాయర్ సంబందం చూసి అమ్మాయి అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మరో వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఆ యువతికి సంబందించిన కొన్ని మార్ఫింగ్ ఫోటో లు ఆ గ్రామం అంతా కనిపించాయి.

దీనితో ఆ విషయాన్నీ గమనించిన స్థానికులు వెంటనే ఆ యువతి కుటుంబం కు తెలపడం తో వారు ఆ పోస్టర్ లను చూసి షాక్ అయ్యారు. దీనితో వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయాన్నీ వెల్లడించారు. దీనితో కూపీ లాగిన పోలీసులు మాజీ లవర్ సరోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలి లో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. మాజీ ప్రియురాలి పై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశ్యం తో ఆ మార్ఫింగ్ పోస్టర్లు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీనితో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు వూర్లో అంటించిన పోస్టర్లు అన్నిటిని కూడా తొలగించినట్లు తెలిపారు. నిజంగా ప్రేమిస్తే ఎవరైనా ప్రాణం ఇస్తారు అని అంటారు కానీ ఇక్కడ మాత్రం ప్రాణం ఇవ్వడం సంగతి అలా ఉంచితే మాజీ ప్రియురాలి పై ప్రతీకారం తీర్చుకోవాలని ఏకంగా ఆమె పోస్టర్ల ను ఊర్లో అంటించి నానా హంగామా సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news