మంచు ల‌క్ష్మీ మ‌రో పాపుల‌ర్ షో.. సెల‌బ్రెటీలే టార్గెట్‌…!

-

కొంత‌కాలంగా వెండితెర‌కు, బుల్లితెర‌కు కాస్త దూరంగా ఉంటున్న మంచు ల‌క్ష్మి.. తిరిగి త‌న అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధం అయింది. మ‌రో ఖ‌త‌ర్నాక్ టీవీ షో ద్వారా త‌న ప‌ర్ఫార్మెన్స్ చూపించేందుకు రెడీ అయింది. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్నకు న‌టిగా, వ్యాఖ్యాత‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే ఎన్నో షోస్‌తో సెల‌బ్రిటీల మ‌నోగ‌తాల‌ను, వారి అభిప్రాయాల‌ను మ‌న ముందు ఉంచిన ల‌క్ష్మీ ఈ సారి సినీ, రాజ‌కీయ‌, క్రీడా త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ చేయ‌నుంది. ఈ ఇంట ‌ర్వ్యూలో ల‌క్ష్మీ వారిని అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడ‌గ‌నుంది. త్వ‌ర‌లో ఈ పాపులర్ షోతో ల‌క్ష్మి ప‌ల‌క‌రించ‌నుంది.

సౌత్ బే స‌మ‌ర్పిస్తోన్న క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు అనే షోకు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రాజ‌మౌళి, తాప్సీ ప‌న్ను.. సెంథిల్ రామ‌మూర్తి, సానియా మీర్జా, ప్ర‌కాష్ అమృత‌రాజ్‌, శంత‌ను, నిఖిల్‌, బిభు మొహాపాత్ర‌, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ త‌దిత‌రుల‌ను ల‌క్ష్మీ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ డిజిట‌ల్ సిరీస్‌ను రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పిస్తున్నారు. కాగా, మంచు ల‌క్ష్మీ గ‌తంలో ప‌లు టాక్ షోస్, రియాలిటీ షోలతో అల‌రించగా, ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అంటూ అంద‌రి బెడ్ రూం సంగ‌తుల‌ని బ‌య‌ట‌పెట్టింది. ఇక లాక్‌డౌన్ సమయంలో కూడా ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’ పేరుతో ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news