మనోభావాలు దెబ్బతిన్నాయని పూనమ్ పాండే పై ముంబై పోలీసులకు ఫిర్యాదు

-

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. సర్వైకల్‌ క్యానర్‌తో మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. అయితే, తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని పూనమ్‌ పాండే ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. అయితే, ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

పూనమ్ పాండే, ఆమె మేనేజర్పై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించారనే ఫేక్ వార్త భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరినీ ఆందోళనకు గురి చేసింది. పబ్లిసిటీ కోసం ఈ ఫేక్ వార్త క్రియేట్ చేశారు. ఇది ఫేక్ అని తెలియడంతో ఆమెకు నివాళులర్పించినవారి మనోభావాలు దెబ్బతిన్నాయి’ అని ఫిర్యాదులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news