రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట….

-

కింగ్ విరాట్ కోహ్లీ – నటి అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.అయితే గత కొన్నిరోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా విరాట్ అనుష్క దంపతులు ఎక్కడ స్పందించలేదు.ఆయన సెలవు వెనుక కారణమేంటన్న దానిపై జరుగుతున్న చర్చకు ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తెరదించారు. విరాట్, అనుష్క దంపతులు త్వరలో మరో బిడ్డకు పేరెంట్స్ కానున్నారని ఆయన తెలిపారు. అందుకే కుటుంబంతో గడపటం కోసం కోహ్లి సెలవు తీసుకున్నారని ఏబీడీ స్పష్టం చేశారు.కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో విరాట్ ను మెచ్చుకొని తీరాలి.. ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేను” అంటూ యూట్యూబ్ షోలో చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ విరాట్ అనుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే.ఇకపోతే విరుష్క 2013 లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్న వారు ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news