రమణ గాడి మాస్ జాతర షురూ.. ‘గుంటూరు కారం’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.!

-

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అతడు, ఖలేజ లాంటి కల్ట్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ,త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

 

గుంటూరు కారం’ అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యిన‌ట్లు చిత్ర‌యూనిట్ సోష‌ల్ మీడియాలో వెల్లడించింది . ఇక ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతుండ‌గా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని చిత్రయూనిట్ ధీమాగా ఉంది. https://in.bookmyshow.com లింక్ ద్వారా ఈ సినిమా టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని చిత్ర యూనిట్ వెల్లడించింది.మ‌రోవైపు గుంటూరు కారం చిత్రం టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో 65 రూపాయలు, మల్లీఫ్లెక్స్‌లలో 100 రూపాయలు పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలోని 23చోట్ల బెనిఫిట్‌ షోల ప్రదర్శనతో పాటు ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news