తెలుగు జాతికి దశ, దిశ చూపిస్తాం : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తునిలో  రా.. కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు ఏపీలోనే ఉన్నాయి. దేశంలో అత్యధిక ధనిక ముఖ్యమంత్రి కూడా ఏపీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. అహంకారం ఉన్న వ్యక్తి ఏపీకి సీఎం అయ్యాడు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వ్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీస్ కల్పిస్తాం. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం.

ప్రజలకు భరోసా ఇచ్చే బాధ్యత నాది అన్నారు. వైసీపీని బంగాళఖాతంలో కలపాలన్నారు చంద్రబాబు. జగన్ రాతి యుగం పోవాలి. నాసిరకం మద్యంతో పేదల జీవితాలను చిదిమేస్తున్నారు. టీడీపీ సునామీలో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుంది. రాష్ట్రంలో జగన్ అప్పుల అప్పారావుగా మారారు. మూడు నెలల తరువాత టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. తెలుగు జాతికి దశ, దిశ చూపిస్తాం. త్వరలో పేదలు, రైతుల రాజ్యం వస్తుంది. తెలుగుదేశం-జనసేన స్వర్ణయుగం రాబోతుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news