లోక్ సభ బరిలో ప్రత్యర్థులుగా మాజీ భార్యాభర్తలు

-

వెస్ట్ బెంగాల్ లోని బిష్ణుపూర్ నియోజకవర్గంలో మాజీ భార్యాభర్తలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు పోటీకి దిగనున్నారు.భారతీయ జనతా పార్టీ తరఫున సౌమిత్రా ఖాన్ బరిలో ఉండగా, ఆయన మాజీ భార్య సుజాత మండలు తృణమూల్ కాంగ్రెస్ పోటీలోకి దిగనుంది. 2019లో సౌమిత్ర ఖాన్ తృణమూల్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేశారు. అప్పట్లో ఆయన తరఫున సుజాత ప్రచారం కూడా చేశారు. అయితే, మూడేళ్ల క్రితం ఆయన భార్య సుజాత సీఎం మమతా బెనర్జీ పార్టీలో చేరడంతో ఇద్దరూ విడిపోయారు.

ఇదిలా ఉంటే…వెస్ట్ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలలోను టిఎంసి అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news