వెబ్ సైట్లో.. గ్రూప్ 2 ఫైనల్ కీ

-

గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ పై హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో రిక్రూట్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇటీవల సమావేశమైన కమిషన్ హైకోర్టు తీర్పుకు లోబడి గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయాలని నిర్ణయణం తీసుకుంది.   తీర్పు ప్రకారం ఫైనల్ కీని రూపొందిస్తున్నామని కమిషన్ తెలిపింది.  టిఎస్‌పిఎస్‌సి నాలుగు పేపర్లలోని 600 ప్రశ్నల్లో తొలుత 17 తీసివేయగా తర్వాత మరో 2 ప్రశ్నలను కూడా తొలగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తొలగించిన ప్రశ్నలకు సమాధానం (రైట్, రాంగ్) పెట్టిన అభ్యర్థులకు మాత్రమే మార్కులు కలపాలని హైకోర్టు పేర్కొంది.  ఫైనల్ కీని 28న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news