సుదర్శన్ థియేటర్‌ ప్రీమియర్‌కి మహేష్ బాబు వస్తున్నాడా..?

-

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేశ్ పూర్తి మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో, అత్యధిక షోలతో ఈ మూవీ విడుదల కాబోతుంది. దీంతో మహేష్ బాబు ఈ మూవీ ఓపెనింగ్స్ తోనే రికార్డులు సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

 

కాగా….. నైజం ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ మహేష్ మూవీ అంటే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌ లోనే చూడాలని అనుకుంటారు. అక్కడ మహేష్ మూవీకి జరిగే సెలబ్రేషన్స్ మరెక్కడా కనిపించవు. అందుకే ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మహేష్ ఫ్యామిలీ కూడా పలు సినిమా విడుదలకు అక్కడికి వచ్చి అభిమానులతో మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇక రేపు విడుదల అవుతున్న గుంటూరు కారంని చూడడానికి కూడా ఘట్టమనేని ఫ్యామిలీ రాబోతుందట.ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ రాబోతున్నట్లు మహేష్ టీంకి చెందిన పిఆర్.. సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ వేసాడు. ఈరోజు అర్ధరాత్రి పడబోయే ప్రీమియర్ కి మహేష్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ బాబు నిజంగానే వస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news