కేంద్రం కీలక నిర్ణయం… కొత్తగా వంద సైనిక పాఠశాలలు..!

-

దేశ వ్యాప్తంగా వంద సైనిక పాఠశాలలను నిర్మించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుండే ఈ పాఠశాలలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. కొత్తగా నిర్మించే ఈ సైనిక పాఠశాలలలో 6వ తరగతి నుండి ప్రవేశాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ పాఠశాల్లో ఐదువేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి.

అంతేకాకుండా ఆరవ తరగతి లో మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సైనిక పాఠశాలలు నిర్మిస్తే దేశంలో సైనిక విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది. ఇక సైనిక పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ సేవ కోసం ఆర్మీలో లక్షణ రంగాల్లో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రక్షణ రంగం లో పని చేయాలని కోరుకునే వారికి స్కూల్స్ పెరగటం తో అవకాశాలు పెరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news