ఈటల రాజేందర్ కు మరో షాక్ : ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ ఫిర్యాదు

-

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మరియు ఆ పార్టీ పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరిరించే ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలపైన, ఆ పార్టీపైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ. అలాగే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నంపై కూడా ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం పైన ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వీటన్నిపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసందే.

Read more RELATED
Recommended to you

Latest news