ఏపీలో జోరు మీదున్న ఫ్యాను.. 15 మున్సిపాలిటీలు కైవసం

-

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 71 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లో ఈ లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. అయితే అందరి చూపు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్ ల వైపు ఎక్కువగా ఉంది.

ఇక ఇప్పటికే వైసీపీ ఖాతాలో 15 మున్సిపాలిటీలు వచ్చి చేరాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి, కడప జిల్లా రాయచోటి, ఎర్రగుంట్ల నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట కర్నూలు జిల్లా ఆత్మకూరు, డోన్, పశ్చిమ godavari జిల్లా కొవ్వూరు వచ్చి చేరాయి. ఇక ఇప్పటికే మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు, పలమనేరు, మదనపల్లి, ముందే ఏకగ్రీవం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news