15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. భారీగా డబ్బు సీజ్

-

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలోని ఎన్‌కెఆర్ గోదాంలో పేకాట ఆడుతున్న కొందరు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి వెల్లడించారు. జిల్లా సరిహద్దుల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్పెషల్ బ్రాంచ్, వనపర్తి పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి 15మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6,35,600నగదు, 4 కార్లు, 3 బైక్ లు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు పేకాట ఆడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో పల్లె వెంకటయ్య (గుడ్డందొడ్డి ధరూర్), గుంజపల్లి వీరేష్, ఆంజనేయులు, అశోక్, ఉప్పరి గోపాల్, జలీల్ భాషా, పాడ రామిరెడ్డి, సత్య స్వరూప్, కూర్వ వీరన్న, కృష్ణయ్య, రంగాపురం, వెంకటన్న, నాగిరెడ్డి, పెబ్బేరు, నరసింహరెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version