తెలంగాణ లో కొత్త గా 195 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

-

తెలంగాణ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల‌లో క‌రోనా కేసులు కాస్త పెరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,77,138 కి చేరింది. అలాగే రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట ల‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఒక‌రు మృతి చెందాడు. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ తో మృతి చెందిన వారి సంఖ్య 4,000 కు చేరింది. అలాగే ఈ ఒక్క రోజు లో నే రాష్ట్రం లో 37,108 క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించారు.

అందు లో కేవ‌లం 195 మంది కే పాజిటివ్ అని తెలింది. కాగ ఈ రోజు తెల‌గాణ రాష్ట్ర వ్యాప్తం గా క‌రోనా వైర‌స్ నుంచి 171 మంది కొలుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,810 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యం లో ప్ర‌జ‌లంద‌రూ టీకాలు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. టీకా నే ఓమిక్రాన్ ను జ‌యించే ఆయుధ‌మ‌ని తెలిపారు. అలాగే టీకా తీసుకున్నా వారు కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version