దారుణం..మైనర్ పై 29మంది అత్యాచారం..!

-

ముంబై లోని డొంబ్ విల్లి లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పై 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం పాల్పడిన వారిలో ఓ యువకుడితో బాలిక కు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో చనువుగా ఉన్న వీడియో లను చిత్రించి తన స్నేహితులకు పంపించాడు. దాంతో మొత్తం 29మంది బాలిక ను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

crime
crime

ఘటనపై మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 26మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు మైనర్ లు కూడా ఉన్నారు. మొత్తం 29 మంది నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news