తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

telangana-logo

వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాల్లో ఈ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. అయితే తెలంగాణ సర్కార్ మంజూరు చేసిన అన్ని కళాశాలలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాక అయిన … ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మంజూరు పై ఆయా స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే నారాయణ పేట జిల్లాలో 2 మండలాలు… వికారాబాద్ జిల్లాలో ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news