కండక్టర్ కుటుంబానికి రూ.40 లక్షలు..!

-

యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. వివరాలు చూస్తే.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం ని అందించి బాధిత కుటుంబానికి భరోసా ని ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్ లో గురువారం రోడ్డు ప్ర‌మాదం లో మృతి చెందారు తాండూరు డిపో కండక్ట‌ర్ లక్ష్మణ్‌.

అయితే వారి కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అందించారు. శిక్షణకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తుండగా ద్విచక్రవాహనం ఢీ కొనడం వలన మృతి చెందారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గత ఏడాది జూన్ 22న ఇది జరిగింది.యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం వుంది. క‌నీసం రూ.40ల‌క్ష‌లు వరకు యూబీఐ అందజేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version